BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 01:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ప్రయాణికుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 01:19 PM
3 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

బస్సుల కోసం గంటల తరబడి నిలబడుతున్న వృద్ధులు, మహిళలు

చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని ఫైర్ స్టేషన్ సెంటర్‌ వద్ద ప్రయాణికుల ఇబ్బందులు తప్పడం లేదు. ఏలూరు వైపు వెళ్లే బస్సుల కోసం ప్రతిరోజూ పలువురు ప్రయాణికులు ఈ ప్రాంతంలో వేచి ఉంటున్నారు. అయితే ప్రయాణికులు కూర్చునేందుకు కనీసం సిమెంట్ బల్లలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సు రాక ఆలస్యమైతే గంటల తరబడి నిలబడటం ఇబ్బందికరంగా మారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారి పక్కనే ప్రయాణికుల రద్దీ ఉండే ప్రాంతంలో కనీస వేచి ఉండే సౌకర్యాలు లేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ సెంటర్‌లో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికులు కొంతసేపు సౌకర్యంగా వేచి ఉండేలా కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.