BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరువు మండలాలుగా ప్రకటించాలి.. రైతులకు ఎకరాకు రూ.25 వేల సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 01:35 PM
0 వీక్షణలు

తిరువూరు: తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఏ.కొండూరు మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వెదురు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. వర్షాభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు.

వర్షాలు సకాలంలో కురవక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికే రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి ఉందని, ప్రస్తుత వర్షాభావం రైతులపై మరింత ఆర్థిక భారం మోపుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, అర్హులైన రైతులందరికీ పరిహారం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని గోపిరెడ్డి కోరారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.