గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు:
ములకలచెరువు మండలం చౌడసముద్రం గ్రామంలో గణేష్ నిమజ్జన సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఏటిగడ్డ తండా సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టు వద్దకు తరలించారు.
ఈ క్రమంలో చౌడసముద్రం గ్రామానికి చెందిన భావజాన్ (24) విగ్రహంతో పాటు నీటిలోకి వెళ్లి గల్లంతైనట్లు సమాచారం. గురువారం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.
శుక్రవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం సంబంధిత సిబ్బంది, స్థానికులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.