ఏపీలో టెట్ అర్హతపై కీలక అప్డేట్
ఆంధ్రప్రదేశ్
ఏపీలో టెట్ అర్హతపై కీలక అప్డేట్ ఏపీలో టెట్ అర్హతకు ప్రత్యేక పరీక్ష.. 46,322 దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష అవకాశాన్ని కల్పిస్తోంది. గత ఏడాది అక్టోబర్లో, ఈ ఏడాది జూన్లో నిర్వహించిన టెట్ పరీక్షల్లో సుమారు 53 వేల మంది అర్హత సాధించారు. ఇంకా సుమారు 34,500 మంది టెట్ అర్హత పొందాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో అర్హత సాధించని వారికి మరో అవకాశం కల్పించేందుకు ప్రత్యేక టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పరీక్షకు మొత్తం 46,322 దరఖాస్తులు వచ్చాయి. కొంతమంది అభ్యర్థులు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రత్యేక టెట్ ద్వారా మరింత మంది ఉపాధ్యాయులు అర్హత సాధించే అవకాశం ఉంది.