వరంగల్ హనుమకొండలో ఇందిరమ్మ టవర్లు: మంత్రి పొంగులేటి
తెలంగాణ
/
హన్మకొండ
హైదరాబాద్: హైదరాబాద్లోని క్యూర్ ప్రాంతంలో ప్రారంభించిన తరహాలో వరంగల్, హనుమకొండలోనూ ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి వన్టైమ్ సెటిల్మెంట్ విధానం అమలు చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరినట్లు తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందిరమ్మ టవర్ల నిర్మాణంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో గృహ వసతి అభివృద్ధికి అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.