డెంగీ వ్యాక్సిన్కు భారత్లో అనుమతి.. 2027లో అందుబాటులోకి
డెంగీ వైరస్పై పోరాటంలో భారత్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ‘QDENGA’ డెంగీ వ్యాక్సిన్కు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) మార్కెటింగ్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ టీకా 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్లో QDENGA సరఫరా కోసం తకేడా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్తో ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్ను మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో డెంగీ సోకిందా లేదా అనే స్క్రీనింగ్ లేకుండానే టీకా తీసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
దేశంలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం డెంగీ నివారణలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. అయితే టీకా ధర, ప్రభుత్వ టీకా కార్యక్రమాల్లో చేర్చే అంశం, ఎవరికి ఇవ్వాలనే మార్గదర్శకాలు వంటి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.