BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 September 2026, 01:47 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భారత్-పాక్ నౌకల ఢీకొనడం.. పాక్ దౌత్య ప్రతినిధికి భారత్ సమన్లు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Sep, 2026 - 01:47 PM
7 వీక్షణలు

నేషనల్ / Ntoday News: అంతర్జాతీయ జలాల్లో భారత నేవీకి చెందిన ఓ నౌక, పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పాకిస్థాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్‌ను భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసి, బలమైన నిరసన తెలిపింది.

పాకిస్థాన్ నేవీ నౌక వ్యవహరించిన తీరు “ఆమోదయోగ్యం కానిది, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైనది” అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటనలో పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.

1991 ఏప్రిల్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10కు పాకిస్థాన్ నేవీ నౌక ప్రవర్తన విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధిత ఒప్పందాలను గౌరవిస్తూ సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు పాటించాలని పాక్ అధికారులకు సూచించాలని ఛార్జ్ డి అఫైర్స్‌కు తెలిపింది.

అదేవిధంగా ఇస్లామాబాద్‌లోని భారత ఛార్జ్ డి అఫైర్స్‌ను కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు ఇదే అంశంపై నిరసన తెలియజేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో భారత నౌకకు పెద్దగా నష్టం జరగలేదని, ఎలాంటి ప్రాణనష్టం కూడా నివేదించలేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.