నౌకపై దాడి.. భారత ప్రభుత్వం సీరియస్
అంతర్జాతీయం
InterNational / Ntoday News :: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. MT EI Gaia అనే నౌకపై జరిగిన దాడిలో 14 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారు. అయితే వారిలో 13 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగిలిన ఒక్కరు మాత్రం మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.