BREAKING
పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు... పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు...
www.ntodaynews.com

హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
06 Apr, 2026 - 08:12 PM
40 వీక్షణలు

హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి-- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు హెల్త్ వీక్ – డే 1: ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్వాతి , ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో BC మరియు ST సంక్షేమ హాస్టళ్ల వంట సిబ్బంది, వార్డెన్లు మరియు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహారం అందించాలని, పరిశుభ్రత పాటిస్తూ ఫుడ్ పొయిజనింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.శారీరక ఆరోగ్యం కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండి,పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని అన్నారు.భువనగిరి గంజ్ ప్రాంతంలో  ఈట్ రైట్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించబడింది.జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఎయిమ్స్ బీబీనగర్ మరియు స్వర్ణగిరి దేవస్థానం ఫుడ్ హ్యాండ్లర్లకు FoSTaC శిక్షణ సర్టిఫికెట్‌లు అందజేయబడినవి ఈ కార్యక్రమానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, జడ్పీ సి ఈ ఒ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, మాధవి  (DCO)  పాల్గొన్నారు.