BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
06 Apr, 2026 - 08:12 PM
31 వీక్షణలు

హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి-- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు హెల్త్ వీక్ – డే 1: ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్వాతి , ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో BC మరియు ST సంక్షేమ హాస్టళ్ల వంట సిబ్బంది, వార్డెన్లు మరియు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహారం అందించాలని, పరిశుభ్రత పాటిస్తూ ఫుడ్ పొయిజనింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.శారీరక ఆరోగ్యం కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండి,పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని అన్నారు.భువనగిరి గంజ్ ప్రాంతంలో  ఈట్ రైట్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించబడింది.జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఎయిమ్స్ బీబీనగర్ మరియు స్వర్ణగిరి దేవస్థానం ఫుడ్ హ్యాండ్లర్లకు FoSTaC శిక్షణ సర్టిఫికెట్‌లు అందజేయబడినవి ఈ కార్యక్రమానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, జడ్పీ సి ఈ ఒ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, మాధవి  (DCO)  పాల్గొన్నారు.