BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 04:00 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భూ భారతి 22ఏపై బీజేపీ సమరభేరి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 04:00 PM
9 వీక్షణలు

సెప్టెంబర్ 5న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మహా దీక్ష

హైదరాబాద్ | Ntoday News

భూ భారతి చట్టంలోని 22ఏ సెక్షన్‌ అంశంపై తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో మహా దీక్షకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.

బీజేపీ ఆరోపణల ప్రకారం.. భూ భారతి పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులకు చెందిన భూములను 22ఏ సెక్షన్‌లో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు మహా దీక్ష నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది.

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 22ఏ సెక్షన్‌ వల్ల భూములకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, భూముల విషయంలో బీజేపీ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం, కాంగ్రెస్‌ వర్గాల స్పందన వెలువడాల్సి ఉంది.