www.ntodaynews.com
బీఆర్ఎస్ తరఫున ఘన విజయం సాధించిన గుంటోజు కృష్ణ
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
బీఆర్ఎస్ తరఫున ఘన విజయం సాధించిన గుంటోజు కృష్ణ
- లక్ష్మీ సాయి మెడోస్ కాలనీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక
నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఊరుమడ్ల | NTODAY News
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు కృష్ణ హైదరాబాద్లోని లక్ష్మీ సాయి మెడోస్ కాలనీలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.
ఎన్నికల్లో ఆయనకు 1,300 ఓట్లు లభించడంతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించినట్లు తెలిపారు. అనంతరం కాలనీ వైస్ ప్రెసిడెంట్గా కూడా గుంటోజు కృష్ణ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఊరుమడ్ల గ్రామ ప్రజలు గుంటోజు కృష్ణకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.