BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 07:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Sep, 2026 - 07:38 PM
4 వీక్షణలు

సర్కిల్‌, వార్డు వారీగా లక్ష్యాలు నిర్దేశించి రోజువారీ పురోగతిని సమీక్షించాలని అధికారులకు ఆదేశం

హనుమకొండ | Ntoday News

హనుమకొండ IDOC కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రత్యేక అధికారి ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్ల పురోగతి, పెండింగ్ బకాయిలు, వసూళ్ల లక్ష్యాలపై అధికారులతో వివరంగా చర్చించారు.

ఈ సందర్భంగా సర్కిల్‌, వార్డు వారీగా పన్నుల వసూళ్లకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి, వాటి సాధనపై రోజువారీగా పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణయించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యంగా కొత్త అసెస్‌మెంట్లు, డబుల్ అసెస్‌మెంట్లు, టాప్ డిఫాల్టర్లు, కమర్షియల్ భవనాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బకాయిల వసూళ్లను వేగవంతం చేసి మున్సిపల్ ఆదాయాన్ని పెంచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం లేకుండా నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.