BREAKING
పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు
www.ntodaynews.com

ఇథనాల్ దెబ్బ.. చక్కెరకు షాక్!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:27 PM
13 వీక్షణలు

రూ.40 నుంచి రూ.65కు చేరిన పంచదార ధరలు

దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గతంలో కిలో రూ.40 వరకు ఉన్న చక్కెర ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.65 వరకు చేరింది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.

చక్కెర ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఇథనాల్ తయారీ కోసం చెరకు వినియోగం పెరగడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంధన మిశ్రమంలో భాగంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచేందుకు చెరకు పంటలో కొంత భాగాన్ని అటువైపు మళ్లించడంతో చక్కెర నిల్వలు తగ్గుతున్నాయని అంచనా.

చక్కెర ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో ధరలు అదుపులోకి రాకపోవడం గమనార్హం. డిమాండ్‌కు సరిపడా నిల్వలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం చక్కెర దిగుమతులపై ఉన్న సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మిల్లుల వద్ద భారీగా పెరిగిన ధరలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చక్కెర మిల్లుల వద్ద 100 కిలోల ధర రూ.5,400 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. ఏడాది క్రితం ఇదే పరిమాణం ధర సుమారు రూ.3,900 ఉండేది. అంటే భారీగా పెరుగుదల నమోదైంది.

రానున్న పండుగల సీజన్‌లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో కేంద్రం నిల్వలపై దృష్టి సారిస్తోంది. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో సరఫరా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇథనాల్ ఉత్పత్తి విధానం, చెరకు వినియోగంలో మార్పులు కొనసాగితే వచ్చే ఏడాది కూడా చక్కెర ధరలపై ఒత్తిడి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.