జానకి రెడ్డి మృతికి నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సంతాపం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం యర్రంపల్లికి చెందిన చింతలపూడి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు, ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జానకి రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆమె మృతికి నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నివాళులు అర్పించారు.
అనంతరం జానకి రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జానకి రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా అందించిన సేవలను మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కొనియాడారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమె చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఆమె మృతి పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.