BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

జీతాలు పెంచాలంటూ జూనియర్‌ డాక్టర్ల భారీ నిరసన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:33 AM
17 వీక్షణలు

గుంటూరు: స్టయ్‌ఫండ్‌ను 15 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జీజీహెచ్‌ జూనియర్‌ డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రమేష్‌ హాస్పిటల్‌ సిగ్నల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన వైద్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. “వీ వాంట్‌ జస్టిస్‌” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పెరుగుతున్న పని ఒత్తిడికి అనుగుణంగా స్టయ్‌ఫండ్‌ లేదని, విధి నిర్వహణలో గంటల తరబడి సేవలందిస్తున్నా తమకు అందుతున్న పారితోషికం తక్కువగా ఉందని జూనియర్‌ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నిరసన ర్యాలీలో జీజీహెచ్‌ పరిధిలోని పలువురు జూనియర్‌ డాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.