జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్ల భారీ నిరసన ర్యాలీ
గుంటూరు: స్టయ్ఫండ్ను 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన వైద్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. “వీ వాంట్ జస్టిస్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పెరుగుతున్న పని ఒత్తిడికి అనుగుణంగా స్టయ్ఫండ్ లేదని, విధి నిర్వహణలో గంటల తరబడి సేవలందిస్తున్నా తమకు అందుతున్న పారితోషికం తక్కువగా ఉందని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన ర్యాలీలో జీజీహెచ్ పరిధిలోని పలువురు జూనియర్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.