కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా
కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా
మణిపూర్ మహిళా కమిషన్తో నిరంతర సంప్రదింపులు.. విద్యార్థినుల భద్రతకు అన్ని చర్యలు
అమరావతి: కాకినాడలో నర్సింగ్ విద్యార్థినులకు సంబంధించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కమిషన్ ఆరా తీస్తోంది. విద్యార్థినుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహిళా కమిషన్ స్పష్టం చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో మణిపూర్ మహిళా కమిషన్తో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, విద్యార్థినుల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మణిపూర్ మహిళా కమిషన్కు భరోసా కల్పించింది.
విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఏపీ మహిళా కమిషన్ వెల్లడించింది.
కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, విద్యార్థినుల క్షేమమే తమ ప్రధాన లక్ష్యమని కమిషన్ పేర్కొంది.