ప్రజాకవి కాళోజి విగ్రహానికి ఘన నివాళులు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
జయంతి సందర్భంగా కాళోజి జంక్షన్, కళాక్షేత్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ, కలెక్టర్
వరంగల్ | Ntoday News
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా వరంగల్లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కాళోజి జంక్షన్లోని కాళోజి నారాయణరావు విగ్రహానికి వరంగల్ ఎంపీ, జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కాళోజి కళాక్షేత్రంలోని కాళోజి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, సామాజిక సమస్యలు, ప్రజల ఆకాంక్షలను తన రచనల ద్వారా చాటిన కాళోజి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
కాళోజి సాహిత్యం, ప్రజా ఉద్యమాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.