కౌన్సిలర్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ జన్మదిన వేడుకలు ఆదివారం పట్టణంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, కౌన్సిలర్ పరమేష్తో కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల చెంత ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పరమేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రజా సేవలో ముందుండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పందిరి శ్రీనివాస్, ప్రముఖ నాయకులు మల్లెబోయిన మల్లేష్ యాదవ్తో పాటు పలువురు కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..