www.ntodaynews.com
కీలక బాధ్యతలో నాగబాబు.. తొలిసారి స్పందన
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై నాగబాబు తొలిసారి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ గ్రీన్ ఛైర్మన్గా తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని నాగబాబు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మొక్కలు నాటడం తన జీవితంలో ఒక భాగమని, ఈ పదవిని గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని నాగబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.