కలుషిత నీటితో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
కలుషిత నీటితో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
జంగారెడ్డిగూడెం శివారు పి. అంకంపాలెం గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్ల 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.
శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో టీవీ ఛానల్లో వచ్చిన వార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యులను ఫోన్ ద్వారా సంప్రదించి, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే నేరుగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఆసుపత్రిలో ఉన్న డీఎంహెచ్ఓతో పాటు వైద్య బృందానికి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పూర్తిగా కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న అనంతరం క్షేమంగా ఇళ్లకు పంపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.