BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

కలుషిత నీటితో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:01 AM
23 వీక్షణలు

కలుషిత నీటితో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

జంగారెడ్డిగూడెం శివారు పి. అంకంపాలెం గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్ల 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.

శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో టీవీ ఛానల్‌లో వచ్చిన వార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యులను ఫోన్ ద్వారా సంప్రదించి, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే నేరుగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఆసుపత్రిలో ఉన్న డీఎంహెచ్‌ఓతో పాటు వైద్య బృందానికి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పూర్తిగా కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న అనంతరం క్షేమంగా ఇళ్లకు పంపించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.