BREAKING
చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం.. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ఏలూరు జిల్లా పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం.. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ఏలూరు జిల్లా పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం
www.ntodaynews.com

కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:31 PM
36 వీక్షణలు

కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. తాగునీటి బోరు వద్ద చెత్త తొలగించాలని డిమాండ్!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలోని బొడ్డు రాయి సెంటర్ సమీపంలో ఉన్న కమ్మరి కుంట చెరువును అక్రమంగా ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు అధికారులను డిమాండ్ చేశారు. గ్రామంలో పరిశీలనకు వచ్చిన అధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లారు.

గ్రామంలోని దళితవాడలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్ బోర్ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.