BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కంభంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 27న చెకుముకి ప్రాథమిక పరీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 07:31 PM
35 వీక్షణలు

కంభంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 27న చెకుముకి ప్రాథమిక పరీక్ష

  • విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడమే లక్ష్యం

కంభంపాడు: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో పరిశోధనా రంగం వైపు అడుగులు వేసేందుకు జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి పరీక్షలు దోహదపడతాయని కంభంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. అదిశేషు అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం చెకుముకి గోడ పత్రికను జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్‌తో కలిసి ప్రధానోపాధ్యాయుడు జె. అదిశేషు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతో పాటు శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, పరిశీలనా శక్తి పెంపొందించేందుకు చెకుముకి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి ప్రాథమిక పరీక్ష పాఠశాల స్థాయిలో ఆగస్టు 27న జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని శాస్త్రీయ ఆసక్తిని పెంపొందించుకోవాలని వారు సూచించారు.

కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎం. రాం ప్రదీప్, మండల అధ్యక్షుడు జి. వంశీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.