BREAKING
రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు నూతన వధూవరుల ఆశీర్వదించిన పున్నం ప్రభాకర్ గారు అనుచరుడు పురుషోత్తం మల్లేష్ గారి కూతురి వివాహ వేడుకలు భాగంగా రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు నూతన వధూవరుల ఆశీర్వదించిన పున్నం ప్రభాకర్ గారు అనుచరుడు పురుషోత్తం మల్లేష్ గారి కూతురి వివాహ వేడుకలు భాగంగా రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
www.ntodaynews.com

రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 10:35 PM
28 వీక్షణలు

కంటాయపాలెం వాస్తవ్యులు, నరసింహులపేట గ్రామానికి చెందిన రాగి భాస్కర చారి గారి చిన్న కుమారుడు రాగి రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచిన విషయం గ్రామంలో విషాదాన్ని నింపింది. చిన్ననాటి నుంచి అందరితో స్నేహపూర్వకంగా మెలిగిన రాగి రాజు మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

రాగి రాజు పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగి రాజు ఎంతో మంచితనంతో, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు.

అలాగే ఇటికేల రాధాకృష్ణ, ఎదులాపురం శోభన్ బాబు తదితరులు కూడా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ ప్రజలు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై రాగి రాజు మృతికి సంతాపం ప్రకటించారు.

రాగి రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని గ్రామ ప్రజలు ప్రార్థించారు.