www.ntodaynews.com
బ్రాహ్మణపల్లి తండాలో చిరుత దాడి.. మేక పిల్ల మృతి
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా శివారులో శనివారం చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఓ మేక పిల్లపై దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.
మేక పిల్ల యజమాని గంగానాయక్ ఈ ఘటనను అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత అడుగుజాడలను గుర్తించి పరిసర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.
గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పశువులను బయటకు వదిలేందుకు కూడా జంకుతున్నారు. వెంటనే చిరుతను బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేయాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు.