BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

అనుమతులు లేకుండా పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయం ఫాతిమా స్కూల్‌పై DSFI ధర్నా.. విద్యాశాఖ అధికారుల సీజ్!

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:29 PM
44 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రం:

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, టైలు, బెల్టులు, యూనిఫామ్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయి కుమార్, నాయకుడు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు విద్యా నియమాలను ఉల్లంఘించి వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల ప్రాంగణంలో పుస్తకాలు, యూనిఫామ్‌లు, ఇతర సామగ్రి విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఫాతిమా స్కూల్ యాజమాన్యం వాటిని పట్టించుకోకుండా తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తోందని ఆరోపించారు.

బయట మార్కెట్‌తో పోలిస్తే రెట్టింపు ధరలకు పుస్తకాలు, టైలు, బెల్టులను బలవంతంగా విక్రయిస్తూ లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి సంఘాల ఆందోళన తీవ్రం కావడంతో సమాచారం అందుకున్న మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) వెంటనే పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో విక్రయానికి ఉంచిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, టైలు, బెల్టుల నిల్వలను తనిఖీ చేశారు. యాజమాన్యం వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటన్నింటినీ అధికారులు అక్కడికక్కడే సీజ్ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని డీఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్పష్టం చేశారు.