BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఘనంగా కొండపర్వ గ్రామంలో బీ.పీ. మండల్ జయంతి వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 08:22 PM
15 వీక్షణలు

ఘనంగా కొండపర్వ గ్రామంలో బీ.పీ. మండల్ జయంతి వేడుకలు.. ఓబీసీల అభ్యున్నతికి ఆయన సేవలు చిరస్మరణీయం

విస్సన్నపేట, ఆగస్టు 25:

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల పితామహుడు, మండల్ కమిషన్ చైర్మన్, సంఘసంస్కర్త బీ.పీ. మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీ.పీ. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బోట్ల శివ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బీ.పీ. మండల్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించి, బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.

బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అవకాశాలు పెరగడానికి మండల్ చేసిన కృషి చారిత్రాత్మకమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు యామిని, సాయిమణికంఠ, హరీష్, హర్ష తదితరులు పాల్గొని బీ.పీ. మండల్ సేవలను స్మరించుకున్నారు.