వైఎస్సార్సీపీ సమన్వయకర్తల సమావేశంలో హిందూపురం ఇంచార్జ్
వైఎస్సార్సీపీ సమన్వయకర్తల సమావేశంలో హిందూపురం ఇంచార్జ్ దీపికా వేణురెడ్డి.. జగనన్నతో భేటీ
విజయవాడ, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమన్వయకర్తల సమావేశంలో హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దీపికా వేణురెడ్డి పాల్గొన్నారు. పార్టీ గౌరవాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై కీలకంగా చర్చించారు.
సమావేశం అనంతరం దీపికా వేణురెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటం గురించి వివరించారు.
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాలనలో జరుగుతున్న వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ జగన్ సూచించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.