గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి
గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి రెవెన్యూ పరిధిలోని ఎంఎల్పీఎల్ కంపెనీ సమీపంలో, రైల్వే ట్రాక్ దగ్గర వేపచెట్టుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడు గోధుమ రంగు ఫుల్హ్యాండ్ షర్ట్, సిమెంట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, ఆధార్ లేదా ఇతర ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు
చిట్యాల ఎస్ఐ 8712670187 నార్కట్పల్లి సీఐ 8712670148 చిట్యాల పోలీస్స్టేషన్ 8712667731 నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.