BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 09:16 PM
12 వీక్షణలు

రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం

ఏపీ పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు: మంత్రి నారా లోకేష్

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఏపీలో అడుగుపెట్టడం రాష్ట్రానికి కీలక పరిణామమని పేర్కొన్నారు. సుజ్లాన్ రాకతో ఏపీలో గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు.

దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 175 గిగావాట్ల లక్ష్యానికి చేర్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి 22 క్లస్టర్లను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ఏపీ–సుజ్లాన్ భాగస్వామ్యంతో సుమారు 12 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

“అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, ఇప్పుడు సుజ్లాన్ రెన్యువబుల్ ఎనర్జీ” అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విషయంలో అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని తెలిపారు.