అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందించడమే లక్ష్యం
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందించడమే లక్ష్యం : ప్రభుత్వ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా-రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మి-సైదులు, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.