BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

పచ్చదనమే లక్ష్యంగా ఉరుమడ్లలో వన మహోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Aug, 2026 - 08:00 PM
73 వీక్షణలు

పచ్చదనమే లక్ష్యంగా ఉరుమడ్లలో వన మహోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం యాదవ్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ. మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాగర్ల భానుశ్రీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసేలా ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అదేవిధంగా కోతుల బెడదను నివారించేందుకు గ్రామాల సమీపంలోని అడవులు, గుట్టల్లో పండ్ల చెట్లను విరివిగా పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అలేందర్ రెడ్డి, ఫారెస్ట్ బీట్ అధికారులు శిరీష, భవాని, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, స్వాతి, పూలమ్మ, సుస్మిత, మమత తదితరులు పాల్గొన్నారు.