BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం.. గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 07:14 PM
21 వీక్షణలు

ఘట్‌కేసర్ పరిధిలో నిందితుడి అరెస్ట్.. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు

హైదరాబాద్‌: గచ్చిబౌలి ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మసీద్‌బండ సమీపంలోని నిర్మాణ కార్మికుల నివాస శిబిరంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

వెంటనే బాధిత కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పరిశీలన, దర్యాప్తు ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించారు.

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కిడ్నాప్‌కు గురైన ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అనంతరం చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ప్రాథమిక విచారణలో అదే లేబర్ క్యాంప్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి చిన్నారులను క్షేమంగా తీసుకురావడంపై పోలీసుల పనితీరుపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.