BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఇల్లూరు గ్రామంలో ఘనంగా వన మహోత్సవం..

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 02:28 PM
14 వీక్షణలు

ఇల్లూరు గ్రామంలో ఘనంగా వన మహోత్సవం.. మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి

మధిర: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మధిర మండలం ఇల్లూరు గ్రామంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇల్లూరు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని కాపాడి పెంచినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో ఒక మొక్క నాటేలా గ్రామ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పచ్చదనం పెరిగితే గ్రామంలో స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, వీఓ సీత, చైర్మన్ నిర్మల జ్యోతి, ఈజీఎస్ జానీ తదితరులు పాల్గొన్నారు.