చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి
చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి
నల్గొండ. జిల్లా చిట్యాల. మండలం
చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి
చిట్యాల: చిట్యాల నుంచి మునుగోడుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము డిమాండ్ చేశారు.
చిట్యాల–మునుగోడు రహదారిపై ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిట్యాల–మునుగోడు మధ్య కనీసం ఒక బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులను జన్నపాల రాము కోరారు.
ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డిమాండ్ చేసిన వారు:
జన్నపాల రాము
గ్రామ యువజన నాయకులు