వేగి లింగేశ్వర స్వామి చెరువు ఆధునీకరణకు శ్రీకారం....
వేగి లింగేశ్వర స్వామి చెరువు ఆధునీకరణకు శ్రీకారం.. చింతలపూడి పట్టణ సుందరీకరణపై ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ దృష్టి
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి పట్టణ సుందరీకరణలో భాగంగా వేగి లింగేశ్వర స్వామి చెరువు కట్టను ఆధునీకరించే ప్రక్రియకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సోమవారం శ్రీకారం చుట్టారు.
ఆదివారం సాయంత్రం వాటర్ ఫౌంటెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన సభలో వేగి లింగ చెరువును ఆధునీకరిస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే, 24 గంటల్లోపే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువు అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా చెరువు పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు కట్టను సుందరీకరించి పట్టణానికి ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
అలాగే పట్టణంలో ఉన్న అన్ని విగ్రహాలను ట్యాంక్ బండ్ తరహాలో ఒకే ప్రాంతానికి తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దీని ద్వారా పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
చింతలపూడి అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.