BREAKING
టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు
www.ntodaynews.com

సామాజిక శంఖారావం — ఆగస్టు 24 కలెక్టరేట్ ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
25 Aug, 2026 - 07:12 AM
15 వీక్షణలు

సామాజిక శంఖారావం — ఆగస్టు 24 కలెక్టరేట్ ధర్నా

విజయనగరం :- వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), వ్యవసాయ కార్మిక సంఘం (ఎపివిడబ్ల్యు) విజయనగరం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో "కుల వివక్ష లేని సమాజం కోసం" నినాదంతో ఆగస్టు 24న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. దళిత, గిరిజన వాడల్లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు, కార్మికులు పాల్గొన్నారు.

ధర్నాలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ నరసింగరావు, తమ్మినేని సీతారాం, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాంబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సారిపల్లి గ్రామానికి సంబంధించిన PAF (ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల) ప్యాకేజీని వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సారిపల్లి మాజీ సర్పంచ్ రాయి విభీషణరావు మాట్లాడుతూ, గ్రామం నుండి 1,398 కుటుంబాలను PAF కింద గుర్తించి, ఆర్&ఆర్ కమిషనర్‌కు నివేదిక పంపించామని, దానికి ఆమోదం కూడా లభించిందని తెలిపారు. అయితే ఎన్నికలు మొదలయ్యే లోపు ఈ ప్యాకేజీ ఖరారు కావాల్సి ఉన్నా, తమ గ్రామానికి PAF విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకుముందు కూడా ఇదే గ్రామం కోసం సీపీఎం నాయకులు, గ్రామ ప్రజలు గ్రామం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ధర్నా నిర్వహించిన సంగతిని రాయి విభీషణరావు గుర్తు చేశారు. మళ్ళీ అదే పరిస్థితి రాకూడదని, ఇప్పటికే సిద్ధమైన నివేదికను వెంటనే ముందుకు పంపి సారిపల్లి గ్రామ PAF సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్ లో ఆయన కోరారు.

ప్రధాన డిమాండ్లు:

కోనేరు రంగారావు, పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి రక్షణ కల్పించాలి

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించాలి

22 'ఏ' నిషేధిత జాబితా నుండి ఎస్సీ, ఎస్టీ భూములను తొలగించాలి

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి

మెజారిటీ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి

జిల్లాలో వి.టి.డి.వి ఏర్పాటు చేయాలి

శ్మశాన వాటిక స్థలాలు కేటాయించి వసతులు కల్పించాలి

భూములు పంచాలి — సాగు భూములకు పట్టాలివ్వాలి

దళిత, గిరిజన వాడల్లో కనీస వసతులు కల్పించాలి

సామాజిక భవనాలు నిర్మించాలి

సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి

గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉన్నవారికి పట్టాలివ్వాలి

వృద్ధ కళాకారుల పెన్షన్ సమస్యలు పరిష్కరించాలి

సారిపల్లి గ్రామంలోని 1,398 కుటుంబాలకు PAF ప్యాకేజీని వెంటనే ఖరారు చేయాలి

ప్రజా ప్రతినిధులు, సంఘ నాయకులు ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనిచో మరింత ఉధృత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.