ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త..
ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
అమరావతి: ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు జీఓ నంబర్ 33ను ప్రభుత్వం విడుదల చేసింది. జులై 2026 నుంచి పదవీ విరమణకు వచ్చే ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు అనుమతులు ఇచ్చింది.
అయితే పదవీ విరమణ వయసు పెంపునకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. తిరిగి విధుల్లో చేరిన కాలానికి సంబంధించిన వేతన బకాయిలు చెల్లించబోమని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే గ్రాట్యుటీ, పెన్షన్ పొందిన ఉద్యోగుల నుంచి జీఓ నంబర్ 45 ప్రకారం రికవరీ చేయాలని ఆదేశించింది.
గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగుల సర్వీస్ రూల్స్లో అవసరమైన సవరణలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయంతో పదవీ విరమణకు చేరువలో ఉన్న పలువురు గురుకుల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.