BREAKING
టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు
www.ntodaynews.com

ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 11:19 AM
9 వీక్షణలు

ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

అమరావతి: ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచింగ్, నాన్‌ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు జీఓ నంబర్‌ 33ను ప్రభుత్వం విడుదల చేసింది. జులై 2026 నుంచి పదవీ విరమణకు వచ్చే ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు అనుమతులు ఇచ్చింది.

అయితే పదవీ విరమణ వయసు పెంపునకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. తిరిగి విధుల్లో చేరిన కాలానికి సంబంధించిన వేతన బకాయిలు చెల్లించబోమని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే గ్రాట్యుటీ, పెన్షన్‌ పొందిన ఉద్యోగుల నుంచి జీఓ నంబర్‌ 45 ప్రకారం రికవరీ చేయాలని ఆదేశించింది.

గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌లో అవసరమైన సవరణలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయంతో పదవీ విరమణకు చేరువలో ఉన్న పలువురు గురుకుల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.