BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 25 August 2026, 11:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 11:19 AM
41 వీక్షణలు

ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

అమరావతి: ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచింగ్, నాన్‌ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు జీఓ నంబర్‌ 33ను ప్రభుత్వం విడుదల చేసింది. జులై 2026 నుంచి పదవీ విరమణకు వచ్చే ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు అనుమతులు ఇచ్చింది.

అయితే పదవీ విరమణ వయసు పెంపునకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. తిరిగి విధుల్లో చేరిన కాలానికి సంబంధించిన వేతన బకాయిలు చెల్లించబోమని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే గ్రాట్యుటీ, పెన్షన్‌ పొందిన ఉద్యోగుల నుంచి జీఓ నంబర్‌ 45 ప్రకారం రికవరీ చేయాలని ఆదేశించింది.

గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌లో అవసరమైన సవరణలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయంతో పదవీ విరమణకు చేరువలో ఉన్న పలువురు గురుకుల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.