BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

తిరువూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 02:29 PM
16 వీక్షణలు

తిరువూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా ఇళ్ల స్థలాలు, పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన.. డిమాండ్లతో మెమోరాండం సమర్పణ

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు:

పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం తిరువూరులో ధర్నా నిర్వహించారు. తిరువూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ఆందోళనలో నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం తహసీల్దార్ చంద్రమౌళికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తూము కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. గతంలో మంజూరైన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన మార్గాలు, సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ఎస్సైన్మెంట్ భూములను 22వ నంబర్ జాబితా నుంచి తొలగించి అసలు వన్‌బీ రికార్డులు అందించాలని, పేదలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాలపాటి ఉదయ్, ఎస్‌కే సుభాని, మాదాసు ప్రసాద్, గురువులు వెంకటేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.