BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 02:47 PM
22 వీక్షణలు

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. రూ.1.25 లక్షల నగదు సీజ్‌

లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. ఏసీబీ డీఎస్పీ సీతారాం

మదనపల్లి:

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై కడప ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.

ఈ తనిఖీల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.1.25 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారాం తెలిపారు. నగదుతో పాటు పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది పనుల కోసం లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే ఏసీబీకి సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. లంచం అడిగిన ఘటనలపై 9440446191 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.

అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ఏసీబీ లక్ష్యమని డీఎస్పీ సీతారాం పేర్కొన్నారు.