BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కూటమి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు: కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:46 PM
34 వీక్షణలు

కూటమి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు: కొలుసు పార్థసారథి

పెండింగ్ ఇళ్ల బిల్లులు త్వరగా విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు

నూజివీడు, ఆగస్టు 3: నూజివీడు పట్టణంలోని 13, 14 వార్డుల్లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.

ప్రజలు వినిపించిన సమస్యలపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని, పింఛన్లు, తల్లికి వందనం పథకం అందని వారి వివరాలను పరిశీలించి అర్హులకు త్వరగా అందేలా చూడాలని సూచించారు.

ఇళ్లు నిర్మించుకుని పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మౌలిక వసతులు పూర్తి చేసి వచ్చే ఎనిమిది నెలల్లో ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు.

డ్రైనేజీ, విద్యుత్ బిల్లులు, గ్యాస్ పథకం, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, ఇంకా అందని పథకాలను అర్హులకు చేరవేయడమే డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటిని వేగంగా పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.