BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 08:05 pm
Posted by : కూనురు మధు

కృష్ణాష్టమి, బోనాల వేళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: బీజేపీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Sep, 2026 - 08:05 PM
12 వీక్షణలు


 కృష్ణాష్టమి, బోనాల పండుగల సందర్భంగా చిట్యాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చిట్యాల మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పండుగ రోజుల్లో పట్టణంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడడంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శీను, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జయరాపు రామకృష్ణ, సీనియర్ నాయకులు కంచర్ల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.