కృష్ణాష్టమి, బోనాల వేళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: బీజేపీ
కృష్ణాష్టమి, బోనాల పండుగల సందర్భంగా చిట్యాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చిట్యాల మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. పండుగ రోజుల్లో పట్టణంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడడంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శీను, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరేళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జయరాపు రామకృష్ణ, సీనియర్ నాయకులు కంచర్ల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.