కుప్పంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై డీఎంహెచ్ఓ సమీక్ష..
కుప్పంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై డీఎంహెచ్ఓ సమీక్ష.. ఆరోగ్య సేవల మెరుగుదలకు సూచనలు
కుప్పం: చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ శశిభూషణ్ రెడ్డి సోమవారం కుప్పం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుప్పం డివిజన్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ వైద్యాధికారిణి గంగాదేవి, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ (PPP) అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలులో పురోగతి సాధించాలని డీఎంహెచ్ఓ సూచించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాల పనితీరును సమీక్షించి, అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.
అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుభాష్ రాజా కుప్పం ప్రాంతంలో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్కు సంబంధించిన సమస్యలను సమావేశంలో వివరించారు.