www.ntodaynews.com
కవితకు నూతన పార్టీకి శుభాకాంక్షలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
కవితకు నూతన పార్టీకి శుభాకాంక్షలు
తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితక్క అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరగనున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు తెలంగాణ జాగృతి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్, వండర్ బుక్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ టి.జి. లింగం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కవితను కలిసి, రాబోయే నూతన రాజకీయ పార్టీకి తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కో-కన్వీనర్ బలికె నిరంజన్, పవన్, తారక్ రామ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.