BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

లక్సెట్టిపేటలో పోలీసుల ‘కార్డన్ సెర్చ్’.. 46 బైకులు, ఆటో సీజ్

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 May, 2026 - 09:02 AM
70 వీక్షణలు

లక్సెట్టిపేట, : నేరాల నియంత్రణే ధ్యేయంగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో పోలీసులు బుధవారం ఉదయం ముమ్మర తనిఖీలు చేపట్టారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని మహాలక్ష్మి వాడ, గోదావరి రోడ్, మోదల రోడ్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని సుమారు 46 బైకులు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అపరిచితులపై నిఘా ఉంచాలి: సీఐ రమణమూర్తి

​ఈ సందర్భంగా సీఐ రమణమూర్తి మాట్లాడుతూ కాలనీల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరిగే వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పరిచయం లేని వ్యక్తులకు, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

​సైబర్ మోసాలపై అప్రమత్తత

​ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు (OTP) అడిగితే చెప్పకూడదని, ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి సరిచూసుకోవాలని ప్రజలకు సూచించారు.

​మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

​మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ప్రమాదాలు జరిగితే మైనర్లతో పాటు తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

​తనిఖీల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది

​ఈ విస్తృత తనిఖీ కార్యక్రమంలో లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసియోద్దీన్, ఉదయ్ కిరణ్‌లతో పాటు లక్సెట్టిపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు