www.ntodaynews.com
మదనపల్లె పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం చేనేత రంగ పితామహుడు ప్రగడ కోటయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కోటయ్య చేసిన కృషిని, ఆప్కో సంస్థ అభివృద్ధిలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసేవలో అందించిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ డి. ఏడుకొండలరెడ్డి, ఆర్ఐ (అడ్మిన్) యు. రంగనాథబాబు, ఆర్ఎస్ఐలు శ్రీనివాస్, రవి, అమరనాథ్రెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.