BREAKING
పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి
Date of Publish : 09 September 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 07:19 PM
5 వీక్షణలు

మధిర, సెప్టెంబర్ 9: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న **‘చలో హైదరాబాద్–హక్కుల సాధన సభ’**ను విజయవంతం చేయాలని మధిర సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు గుర్రం శ్రీనివాసరావు, ఆర్. రంగారావు, షేక్ నాగూర్ వలి పిలుపునిచ్చారు.

బుధవారం భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను సందర్శించిన నాయకులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

తక్షణమే వేతన సవరణ సంఘం నివేదిక తెప్పించి ఫిట్‌మెంట్ ప్రకటించాలి

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలి

నూతన ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

పెన్షనర్ల బకాయిలను నెలకు రూ.2,000 కోట్ల చొప్పున విడుదల చేయాలి

ఉద్యోగుల హక్కులు, సమస్యల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 10 కార్యక్రమానికి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు హాజరై విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు పఠాన్ బాజీఖాన్, పోలె సుధాకర్, జి. రజినీకాంత్, సత్యనారాయణ రెడ్డి, ప్రవీణ్, సాయి, మానస, బాగం వేణు, జి. వేణు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.