మధిరలో ఘనంగా కీర్తి డిజిటల్ స్టూడియో ప్రారంభం
మధిరలో ఘనంగా కీర్తి డిజిటల్ స్టూడియో ప్రారంభం
ఫొటో ఒక్కటే జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతుంది : టౌన్ సీఐ డి. రమేష్
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోగ్రఫీ రంగంలో ముందుకు సాగాలి
మధిర, ఖమ్మం జిల్లా:
మధిర పట్టణంలో కీర్తి డిజిటల్ స్టూడియో నూతన హంగులతో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గత 20 సంవత్సరాలుగా ప్రజల ఆదరణ, అభిమానంతో కొనసాగుతున్న కీర్తి డిజిటల్ ఫోటో స్టూడియో ఆధునిక సౌకర్యాలతో నూతన రూపాన్ని సంతరించుకుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధిర టౌన్ సీఐ డి. రమేష్ స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కళ్ల ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచేది ఒక్క ఫొటో మాత్రమేనని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యతను పెంచుకుంటూ ఫొటోగ్రఫీ రంగంలో ముందుకు సాగాలని సూచించారు.
కొత్త పరిజ్ఞానంతో ఫొటోగ్రఫీ రంగంలో అభివృద్ధి చెందుతున్న కీర్తి డిజిటల్ స్టూడియో అధినేతలు చిలివేరు సాంబశివరావు, శ్యాంబాబులను సీఐ రమేష్ అభినందించారు. కస్టమర్లు, శ్రేయోభిలాషుల ఆదరణ, ఆశీస్సులు ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు.