BREAKING
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్
Date of Publish : 08 September 2026, 08:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు ఘన సత్కారం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 08:36 PM
12 వీక్షణలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం మదర్ థెరిస్సా సేవాసదనం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న లీలా విజయ్, సాధినేని రాజేశ్వరి, జ్యోతి, ఊస రమాదేవి, భిక్షాలు తదితరులను పలువురు ప్రముఖులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యారంగంలో వారు అందిస్తున్న విశిష్ట సేవలు, అంకితభావం, నిబద్ధతకు గుర్తింపుగా లభించిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వారి జీవితంలో మరెన్నో విజయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వారణాసి కళావతి, విశ్రాంత ఎంపీడీవో మాధవరపు నాగేశ్వరరావు, సామాజిక సేవకులు పుల్లఖండం సత్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సెట్టిపోగు రాము, మదర్ థెరిస్సా సేవాసదనం నిర్వాహకులు స్వర్ణలత సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.