మెదక్లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం.. భారీగా తరలిరావాలని నేతల పిలుపు
మెదక్లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం.. భారీగా తరలిరావాలని నేతల పిలుపు
మోటార్ సైకిల్ ర్యాలీతో నాయకులకు స్వాగతం
మెదక్, ఆగస్టు 23:
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం సోమవారం మెదక్ పట్టణంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
సమావేశం సందర్భంగా మెదక్ పట్టణంలోని నర్సాపూర్ రోడ్డులో ఉన్న వెల్కమ్ బోర్డు నుంచి వినాయక ఫంక్షన్ హాల్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు, యువజన, మహిళా విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మెదక్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ కోరారు.
ఈ సమావేశానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.