మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం
మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దుల్లో ఉన్న మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి దేవస్థానానికి ఓ దాత లక్ష రూపాయల విరాళం అందజేశారు.
పెనుగొలను గ్రామపంచాయతీ పరిధిలోని చల్లగుండ్లవారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పెల నాగిరెడ్డి, కృష్ణవేణి దంపతులు శనివారం ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు ఈ విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణానికి వినియోగించాలని దాతలు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఉప్పెల నాగిరెడ్డి దంపతులను ప్రధానార్చకులు తూమాటి శ్యామ సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు.
దేవస్థాన అభివృద్ధికి విరాళం అందించిన దాతలకు ఆలయ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు, ఆర్. వెంకటసుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.