BREAKING
సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 05:11 PM
12 వీక్షణలు

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దుల్లో ఉన్న మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి దేవస్థానానికి ఓ దాత లక్ష రూపాయల విరాళం అందజేశారు.

పెనుగొలను గ్రామపంచాయతీ పరిధిలోని చల్లగుండ్లవారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పెల నాగిరెడ్డి, కృష్ణవేణి దంపతులు శనివారం ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు ఈ విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణానికి వినియోగించాలని దాతలు తెలిపారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఉప్పెల నాగిరెడ్డి దంపతులను ప్రధానార్చకులు తూమాటి శ్యామ సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు.

దేవస్థాన అభివృద్ధికి విరాళం అందించిన దాతలకు ఆలయ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు, ఆర్. వెంకటసుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.